భారీ లాభాల్లో ముగిసిన Stock markets..

ABN , First Publish Date - 2022-05-17T21:26:03+05:30 IST

ముంబై : వరుసగా రెండవ సెషన్ అయిన మంగళవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1345 పాయింట్లు లేదా 2.54 శాతం వృద్ధి చెంది 54,318 పాయింట్ల వద్ద ముగిసింది.

భారీ లాభాల్లో ముగిసిన Stock markets..

ముంబై : దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండవ సెషన్ అయిన మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 1345 పాయింట్లు లేదా 2.54 శాతం వృద్ధి చెంది 54,318 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ (Nifty50) సూచీ 417 పాయింట్లు లేదా 2.63 శాతం మేర లాభపడి 16,259 పాయింట్లు వద్ద స్థిరపడింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ కూడా లాభాల జోరును కొనసాగించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 2.73 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ 3.36 శాతం చొప్పున వృద్ధి చెందాయి. మెటల్, ఎనర్జీ స్టాక్స్ రాణించడం మార్కెట్లు చక్కటి లాభాలకు సానుకూలమైంది. మార్కెట్లు లాభాలతో దూసుకెళ్లినప్పటికీ ఎల్‌ఐసీ లిస్టింగ్ (Lic listing) తీవ్రంగా నిరాశపరచడం గమనార్హం. ఎల్‌ఐసీ ఇష్యూ ప్రైస్ రూ.949 కాగా 8.62 శాతం నష్టంతో రూ.872.70 వద్ద బీఎస్ఈపై నమోదయింది. ఇక నిఫ్టీపై 8.01 శాతం నష్టంతో రూ.873 వద్ద లిస్టింగ్ అయ్యింది. 

Updated Date - 2022-05-17T21:26:03+05:30 IST