262 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ABN , First Publish Date - 2022-09-22T06:36:22+05:30 IST
ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వార్తలు బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ని కూడా నష్టాల్లో నడిపించాయి.
ముంబై: ఫెడ్ వడ్డీరేట్ల పెంపు వార్తలు బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ని కూడా నష్టాల్లో నడిపించాయి. సెన్సెక్స్ 262.96 పాయింట్ల నష్టంతో 59,456.78 వద్ద, నిఫ్టీ 97.90 పాయింట్ల నష్టంతో 17,718.35 వద్ద ముగిశాయి. దీంతో వరుసగా రెండు సెషన్ల ర్యాలీకి తెరపడింది. ఐటీసీ వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లు మాత్రమే బుధవారం కొద్ది పాటి లాభాలతో ముగిశాయి.