ఎగిసి.. పడే!
ABN , First Publish Date - 2020-05-27T06:38:31+05:30 IST
ఎగిసి.. పడే!
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం, ఆర్థిక పునరుజ్జీవంపై అనిశ్చితి వంటి ప్రతికూలతలు స్టాక్ మార్కెట్లను కూలదోశాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 31,086 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. అమ్మకాల ఒత్తిడితో సూచీ ఒక దశలో 30,512 స్థాయికి పతనమైంది. ఇంట్రాడేలో 574 పాయింట్లకు పైగా కదలాడిన సూచీ.. చివరికి 63.29 పాయింట్ల నష్టంతో 30,609.30 వద్ద స్థిరపడింది. ఎన్ఎ్సఈ నిఫ్టీ కూడా 10.20 పాయింట్లు నష్టపోయి 9,029.05 వద్ద నిలిచింది.