రుయా ఘటన తర్వాత వెలుగు చూస్తున్న సంచలన విషయాలు
ABN , First Publish Date - 2021-05-11T15:36:06+05:30 IST
తిరుపతి: నిన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక నిమిషాల వ్యవధిలోనే 11 మంది మృతి చెందారు.
తిరుపతి: నిన్న తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక నిమిషాల వ్యవధిలోనే 11 మంది మృతి చెందారు. దీంతో ప్రస్తుతం రుయాకు సంబంధించి మరికొన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చనిపోయింది 11 మంది కాదని.. మొత్తం 29 మంది అని తెలుస్తోంది. మృతి చెందిన 11 మంది బెడ్స్తో పాటు తమతో వైద్యం తీసుకుంటున్న మరో 18 మంది బెడ్స్ కూడా ఖాళీగా ఉండటంతో వారంతా మరణించి ఉంటారని రోగులు చెబుతున్నారు. ప్రస్తుతం రుయాలో ఒకే ఒక్క జూనియర్ డాక్టర్ ఉన్నారు. బాధితులందరికీ ఆయన ఒక్కరే వైద్యం అందిస్తున్నారు. ఆయనను బాధితుల బంధువులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కనీసం దూది కూడా లేదు. పేపర్తో రక్తం తుడుస్తున్నారు. సర్జికల్ గ్లోవ్ లేదు. షుగర్ స్ట్రిప్లు లేవు. మందులు లేవు. లోపల పరిస్థితిపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వైద్యులు సైతం వచ్చి తమకు చికిత్సను అందించాలని కోరుతున్నారు.