డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు
ABN , First Publish Date - 2022-04-11T00:59:07+05:30 IST
డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడింగ్ మింక్ పబ్కు రెండు వారాల క్రితమే డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడింగ్ మింక్ పబ్కు రెండు వారాల క్రితమే డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేశారు. డ్రగ్స్తో పాటు హాష్ ఆయిల్ సిగరెట్లు, గంజాయి అమ్మకాలను పబ్ యాజమాన్యం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒక్కో హాష్ ఆయిల్ సిగరెట్ రూ. 8 వేల చొప్పున అమ్మినట్లు తెలుస్తోంది. ఫుడింగ్ మింక్లో లేట్నైట్ పార్టీ జరుగుతున్నట్లు.. మరో పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పబ్పై దాడి చేసినప్పుడు పోలీసులు 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 148 మంది రక్త నమూనాలు సేకరించడం కుదరదని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న కిరణ్రాజుకు హైదరాబాద్ పోలీసుల నోటీసులిచ్చారు. తాను విదేశాల్లో ఉన్నానని, డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు కిరణ్రాజు మెయిల్ పంపాడు.