బెదిరించి పెళ్లి చేసుకుని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం.. భర్తపై మహిళా టీచర్ సంచలన ఆరోపణలు..

ABN , First Publish Date - 2022-04-12T18:05:58+05:30 IST

ఆమె ఓ కాలేజీలో లెక్చరర్.. ప్రేమ అంటూ ఆమె వెంటబడిన యువకుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు..

బెదిరించి పెళ్లి చేసుకుని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం.. భర్తపై మహిళా టీచర్ సంచలన ఆరోపణలు..

ఆమె ఓ కాలేజీలో లెక్చరర్.. ప్రేమ అంటూ ఆమె వెంటబడిన యువకుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. అనంతరం కులం పేరు మార్చి చెప్పి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత ఆమెకు మరింత నరకం చూపించాడు.. స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ ఘటనలను వీడియో తీసి ఆమెను బెదిరించేవాడు.. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


హర్యానాలోని హిసార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఓ యువకుడు ప్రేమ అంటూ ఆమె వెంటపడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఇద్దరిదీ ఒకే కులం అని చెప్పి వివాహం చేసుకున్నాడు. ఆ యువకుడిది వేరే కులం అని ఆమెకు వివాహం తర్వాత తెలిసింది. అయినా సర్దుకుపోయి కాపురం చేయాలనుకుంది. అయితే మోసం చేసి పెళ్లి చేసుకున్న అతను ఆమెను ప్రతిరోజూ టార్చర్ పెట్టేవాడు. 


ఒకరోజు ఇద్దరు స్నేహితులను ఇంటికి తీసుకెళ్లి బాధిత మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీయించాడు. ఆ వీడియో చూపించి ఆమెను అదుపులో పెట్టుకోవాలనుకున్నాడు. ఆమె నుంచి డబ్బులు కూడా బలవంతంగా తీసుకునేవాడు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. భర్త అకృత్యాలన్నింటినీ పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 

Updated Date - 2022-04-12T18:05:58+05:30 IST