తన భర్తకు ఓటేయమని లక్నో ఐజీ బలవంతం... ECకి సమాజ్‌వాదీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-02-15T14:11:11+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్న లక్నో రేంజ్ ఐజీ లక్ష్మీసింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమాజ్‌వాదీ ఫిర్యాదు...

తన భర్తకు ఓటేయమని లక్నో ఐజీ బలవంతం... ECకి సమాజ్‌వాదీ ఫిర్యాదు

లక్నో(ఉత్తరప్రదేశ్): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేస్తున్న లక్నో రేంజ్ ఐజీ లక్ష్మీసింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమాజ్‌వాదీ ఫిర్యాదు చేసింది. లక్నో ఐజీ లక్ష్మీసింగ్ భర్త,మాజీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాజేశ్వర్ సింగ్ లక్నోలోని సరోజినినగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.లక్నో రేంజ్ ఐజీ లక్ష్మీ సింగ్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.తన భర్త అయిన బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇది ఎన్నికలను ప్రభావితం చేస్తుందని సమాజ్ వాదీ పార్టీ ఫిర్యాదు చేసింది.దీనిపై మొదట ఫిబ్రవరి 7న ఫిర్యాదు చేసి, మళ్లీ ఫిబ్రవరి 11న ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఎస్పీ నేతలు తెలిపారు.


Updated Date - 2022-02-15T14:11:11+05:30 IST