ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు

ABN , First Publish Date - 2021-01-19T14:18:33+05:30 IST

టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి జిల్లాలో..

ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు

గుంటూరు(ఆంధ్రజ్యోతి): టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి జిల్లాలో సోమవారం వాడవాడలా జరిగింది. పలు ప్రాంతాల్లో అన్నదానం, రక్తదానం, పాలాభిషేకాలు నిర్వహించారు. వినుకొండ, చిలకలూరి పేటల్లో జరిగిన కార్యక్రమాలో వర్ల రామయ్య, ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ రక్తదానం చేశారు. రేపల్లెలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌  ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. అమరావతి మండలం అత్తలూరులో పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

Updated Date - 2021-01-19T14:18:33+05:30 IST