Ramakrishna Math సీనియర్ సన్యాసి కన్నుమూత...సీఎం సంతాపం

ABN , First Publish Date - 2021-10-18T15:03:08+05:30 IST

రామకృష్ణ మఠం సీనియర్ సన్యాసి స్వామి అమేయానందజీ ఆదివారం రాత్రి కన్నుమూశారు....

Ramakrishna Math సీనియర్ సన్యాసి కన్నుమూత...సీఎం సంతాపం

కోల్‌కతా :  రామకృష్ణ మఠం సీనియర్ సన్యాసి స్వామి అమేయానందజీ ఆదివారం రాత్రి కన్నుమూశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా జయరాంబాటి రామకృష్ణ మఠం కేంద్రానికి స్వామి అమేయానందజీ అధిపతిగా పనిచేశారు.బంగ్లాదేశ్ లోని ఢాకా కేంద్రానికి ఈయన మూడు సంవత్సరాల పాటు అధిపతిగా పనిచేశారని రామకృష్ణ మఠం ఒక ప్రకటనలో తెలిపింది.రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్ఠాన్‌ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో స్వామి అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 


స్వామి అమేయానందజీ మృతి ఆధ్యాత్మిక ప్రపంచంలో శూన్యతకు కారణమైందని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపసందేశంలో పేర్కొన్నారు. స్వామి భౌతికకాయాన్ని రామకృష్ణ మిషన్ ప్రపంచ ప్రధాన కార్యాలయమైన బేలూరు మఠంలో సోమవారం మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఉంచుతారు.అనంతరం అంత్యక్రియలు రాత్రి 9 గంటలకు మఠంలో నిర్వహిస్తామని రామకృష్ణ మఠం తెలిపింది. 


Updated Date - 2021-10-18T15:03:08+05:30 IST