CM KCR వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం.. టీఆర్ఎస్కు రాజీనామా
ABN , First Publish Date - 2022-03-10T18:54:44+05:30 IST
CM KCR వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం.. టీఆర్ఎస్కు రాజీనామా
హైదరాబాద్ సిటీ/మంగళ్హాట్ : కొంత కాలంగా సీఎం కేసీఆర్ హిందూ మతంపై దాడి చేసేలా వ్యాఖ్యలు చేయడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, అందుకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ గోషామహల్ నియోజకవర్గ నాయకుడు గోవింద్ రాఠి తెలిపారు. బుధవారం కోఠిలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మనోజ్ జైశ్వాల్తో కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ గతంలో హిందువులు, బొందువులు అన్నారని, తాజాగా వనపర్తిలో కాషాయం జెండాపై వ్యాఖ్యలు చేయడం బాధకలిగించిందని అన్నారు. హిందూ వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్న పార్టీలో తాను కొనసాగనని, అందుకే తన రాజీనామా లేఖను పార్టీ అధికారనాయకత్వానికి ఫ్యాక్స్ చేయనున్నట్టు చెప్పారు.