కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత
ABN , First Publish Date - 2020-09-27T21:41:51+05:30 IST
కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, చంగనస్సేరి ఎమ్మెల్యే సీఎఫ్ థామస్ ఆదివారంనాడిక్కడ..
కొట్టాయం: కేరళ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, చంగనస్సేరి ఎమ్మెల్యే సీఎఫ్ థామస్ ఆదివారంనాడిక్కడ కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. తిరువళ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రులో ఆయన కాన్సర్స్కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. థామస్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, విపక్ష నేత రమేష్ చెన్నితాల సంతాపం తెలిపారు.
థామస్ 1980 నుంచి చెంగనస్సేరి నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. కేరళ కాంగ్రెస్ వ్యవస్థాపక నేతల్లో ఆయన ఒకరు. పార్టీ అధ్యక్షుడు కేఎం మణి మరణానంతరం పీజే జోసెఫ్ వర్గంలో థామస్ చేశారు. కేరళ కాంగ్రెస్ జోసెఫ్ వర్గానికి డిప్యూటీ చైర్మన్గా కూడా ఆయన సేవలందించారు. 2001-2006లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, రిజిస్ట్రేషన్, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. కేరళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, చైర్మన్గా కూడా థామస్ పనిచేశారు. కేరళ కాంగ్రెస్ దివంగత నేత కేఎం మణికి అత్యంత సన్నిహితుడనే పేరు ఆయనకు ఉంది.