సీనియర్ పత్రికా విలేకరి సలాం మృతి
ABN , First Publish Date - 2020-08-11T10:13:57+05:30 IST
సీనియర్ పత్రికా విలేకరి, ఫొటోగ్రాఫర్ నాయకన్గూడెం గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం(55) గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు.
మాజీమంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కందాళ సంతాపం
కూసుమంచి, ఆగస్టు 10: సీనియర్ పత్రికా విలేకరి, ఫొటోగ్రాఫర్ నాయకన్గూడెం గ్రామానికి చెందిన అబ్దుల్ సలాం(55) గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈతెల్లవారుజామున మృతిచెందారు. 20 సంవత్సరాలుగా పలుపత్రికల్లో రిపోర్టర్గాను, ఫోటోగ్రాఫర్గాను పనిచేశారు. సలాం మృతిపట్ల మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఫోన్లో కుటుంబసభ్యులను పరామర్శించారు.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూధన్, ఎంపీపీ బాణోతు శ్రీనివాస్, జడ్పీటీసీ ఇంటూరి శేఖర్, వైస్ఎంపీపీ పద్మ-వీరారెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు పరుశురామ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సేట్రాం, ఎంపీటీసీ ఉపేందర్, సర్పంచి కాసాని సైదులు, తదితరులు, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు మృతదేహానికి నివాళులు అర్పించారు.