నలుగురికి ప్లాస్మా దానం చేసిన జర్నలిస్ట్...

ABN , First Publish Date - 2021-04-13T12:24:31+05:30 IST

కరోనా మహమ్మరి బారి నుంచి కోలుకుని మరో నలుగురు కరోనా

నలుగురికి ప్లాస్మా దానం చేసిన జర్నలిస్ట్...

హైదరాబాద్/రామంతాపూర్‌ : కరోనా మహమ్మరి బారి నుంచి కోలుకుని మరో నలుగురు కరోనా బాధితులకు ప్లాస్మా దానం చేయడంతోపాటు గతంలో రెండుసార్లు తెల్ల రక్తకణాలు,  34 సార్లు రక్తదానం చేసిన ఉప్పల్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్టు కొడికంటి శ్రీనివాస్‌ పలువురి ప్రశంసలను అందుకుంటున్నారు. శ్రీనివాస్‌ సేవా నిరతిని గుర్తించిన సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీపీ సజ్జానార్‌ అతడిని ప్రత్యేకంగా అభినందించారు. శ్రీనివా్‌సను పలువురు అధికారులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, వివిధ రంగాల ప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు. భవిష్యత్తులో సైతం తన సేవా నిరతిని కొనసాగిస్తానని శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2021-04-13T12:24:31+05:30 IST