కాంగ్రెస్ సీనియర్ నేత సదానంద్ సింగ్ కన్నుమూత!

ABN , First Publish Date - 2021-09-08T16:15:34+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత సదానంద్ సింగ్ ఈరోజు ఉదయం కన్నుమూశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత సదానంద్ సింగ్ కన్నుమూత!

పట్నా(బీహార్): కాంగ్రెస్ సీనియర్ నేత సదానంద్ సింగ్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ మాట్లాడుతూ, "బీహార్‌కు చెందిన ప్రముఖ నేత, కాంగ్రెస్ యోధుడు సదానంద్ సింగ్ ఈరోజు కన్నుమూశారు. ఆయన మృతితో ఒక రాజకీయ శకం ముగిసింది. 


సదానంద్ సింగ్ చిరునవ్వు ఎప్పటికీ అందరికీ గుర్తుంటుందన్నారు. కాగా సదానంద్ సింగ్ కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం పట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. బీహార్ ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్ కూడా సదానంద్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. సదానంద్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్ననని పేర్కొన్నారు.

Updated Date - 2021-09-08T16:15:34+05:30 IST