అన్నాడీఎంకే సీనియర్ మంత్రి పి.తంగమణికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-07-08T23:52:46+05:30 IST
అన్నాడీఎంకే సీనియర్ మంత్రి పి.తంగమణికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా...
చెన్నై: అన్నాడీఎంకే సీనియర్ మంత్రి పి.తంగమణికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి మంగళవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తమిళనాడు సీఎంవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. లాక్డౌన్ సమయంలో మంత్రి తంగమణి పలు జిల్లాల్లో పర్యటించారు.
59 సంవత్సరాల వయసున్న ఈ మంత్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవడంతో సెక్రటేరియట్లో టెన్షన్ మొదలైంది. తంగమణికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన ఒక్కరోజు ముందే ఆయన సెక్రటేరియట్లో సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. చెన్నై అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ మీటింగ్లో కూడా ఆయన పాల్గొన్నట్లు తెలిసింది.
తమిళనాడులో తంగమణితో కలిపి ఇప్పటికి ఇద్దరు మంత్రులకు కరోనా సోకింది. ఉన్నత విద్యా శాఖ మంత్రి కేపీ అన్బళగన్కు ఇప్పటికే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో కరోనా సోకి ఇప్పటికే ఓ ప్రజాప్రతినిధి మరణించారు. డీఎంకే ఎమ్మెల్యే జె.అన్బగళన్(62) కరోనా సోకి పరిస్థితి విషమించడంతో ఆయన 62వ పుట్టినరోజు నాడే ఆయన కన్నుమూయడం శోచనీయం.