అభివృద్ధి కోసమే పాదయాత్ర

ABN , First Publish Date - 2020-09-25T11:15:29+05:30 IST

ఇల్లెందు మునిసిపా లిటిలోని వివిధ వార్డుల్లో అనేక సంవత్సరాలుగా ఎలాంటి పరిష్కారానికి నోచని సమస్యలను గుర్తించి పరిష్కరిం చేందుకే 24వార్డుల్లో పాదయాత్ర నిర్వహించినట్లు మునిసిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్‌రావు అన్నా రు.

అభివృద్ధి కోసమే పాదయాత్ర

చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు


ఇల్లెందుటౌన్‌, సెప్టెంబరు 24: ఇల్లెందు మునిసిపా లిటిలోని వివిధ  వార్డుల్లో అనేక సంవత్సరాలుగా ఎలాంటి పరిష్కారానికి నోచని సమస్యలను గుర్తించి పరిష్కరిం చేందుకే 24వార్డుల్లో పాదయాత్ర నిర్వహించినట్లు మునిసిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్‌రావు అన్నా రు. గురువారం మునిసిపాలిటి 24వ వార్డులో పాదయాత్ర చేపట్టారు. వార్డులో ప్రజా సమస్యలను వినతుల ద్వారా స్వీకరించారు.


ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ 24 వార్డుల్లో 24రోజులపాటు పా దయాత్ర చేసినట్లు వెల్లడించారు. ఈ పాదయాత్ర ద్వారా వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను గుర్తిం చినట్లు పేర్కొన్నారు. గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత కల్పించి తగిన నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. ప ట్టణ ప్రజలు ప్రదానంగా ఎదుర్కొనే సమస్యలను త్వ రితగతిన పరిష్కరించేందుకకు తగిన ప్రణాళికలు రూపొందించనున్నట్లు వివరించారు.


అన్ని వార్డుల్లో ఉన్న ప్రధాన సమస్యలను నిధులను వెచ్చించేందుకు ము నిసిపల్‌ పాలకవర్గం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టన ప్రధాన కార్యదర్శి ప రుచూరి వెంకటేశ్వర్‌రావు, 24వ వార్డు కౌన్సిలర్‌ తార త దితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T11:15:29+05:30 IST