నాగసూరి సాహిత్యంపై సదస్సు
ABN , First Publish Date - 2021-01-18T10:07:31+05:30 IST
జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సాహిత్యంపై జనవరి 24 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆన్లైన్ సాహిత్య...
జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సాహిత్యంపై జనవరి 24 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆన్లైన్ సాహిత్య సదస్సు జరుగుతుంది. ‘సాహితీ వీక్షణం’, ‘సాహితీ స్పర్శ’ పుస్తకాలపై కాళ్లకూరి శైలజ, ‘విద్వాన్ విశ్వం’పై అప్పిరెడ్డి హరనాథరెడ్డి, ‘మదరాసు బతుకులు’ పై సయ్యద్ సలీం, ‘కథా వరణం’ పై శిరంశెట్టి కాంతారావు మాట్లాడుతారు. అంగలకుర్తి విద్యాసాగర్ ముఖ్య అతిధి.
నూకతోటి రవికుమార్