దూసుకుపోతున్న సెమీకండక్టర్లు * ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం ‘రికార్డ్’ వృద్ధి

ABN , First Publish Date - 2022-04-29T20:01:38+05:30 IST

ఇండియాలో సెమీకండక్టర్ల వినియోగం 2026 నాటికి $80 బిలియన్లు, 2034 నాటికి $110 బిలియన్లను దాటనుంది.

దూసుకుపోతున్న సెమీకండక్టర్లు  * ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం ‘రికార్డ్’ వృద్ధి

న్యూఢిల్లీ : ఇండియాలో సెమీకండక్టర్ల వినియోగం 2026 నాటికి $80 బిలియన్లు, 2034 నాటికి $110 బిలియన్లను దాటనుంది.  ప్రధాని మోదీ రోజు(శుక్రవారం) బెంగళూరులో భారతదేశపు తొలి మూడు రోజుల సెమీకండక్టర్ కాన్ఫరెన్స్... ‘సెమీకాన్ ఇండియా 2022’ను ప్రారంభించారు. సెమీకండక్టర్ హబ్‌గా మారాలనే భారత్ లక్ష్యాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. భవిష్యత్తులో కూడా సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతునిస్తామన్నారు. ఇదిలా ఉంటే... భారత్ సెమీకండక్టర్ల వినియోగం 2026 నాటికి $80 బిలియన్లు, 2030 నాటికి $110 బిలియన్లను దాటనున్నట్లు అంచనా. కాగా... సెమీకండక్టర్లు, వినియోగానికి సంబంధించి వచ్చే నెలలో మరిన్ని ప్రకటనలు వచ్చే అవకాశమున్నట్లుగా వినవస్తోంది.  ఇదే క్రమంలో... సెమీకండక్టర్ల తయారీ రంగాన్ని మార్చేందుకు భారత్ పలు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే... భారత్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ) పథకం, 14 కీలక రంగాలలో $26 బిలియన్లకు పైగా ప్రోత్సాహకాలనందిస్తోంది. రానున్న  ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగం రికార్డు స్థాయిలో వృడద్ధి చెందుతుందని అంచనాలున్నాయి.

Updated Date - 2022-04-29T20:01:38+05:30 IST