రఘురామ కృష్ణంరాజు మరో సెల్ఫీ వీడియో
ABN , First Publish Date - 2020-06-06T21:22:09+05:30 IST
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇసుక కొరత సమస్య పరిష్కారానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, గ్రామ సచివాలయాల ద్వారా
ఏలూరు: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇసుక కొరత సమస్య పరిష్కారానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని, గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక బుక్ చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు. ఇసుక వ్యవహారంలో అవకతవకలు జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని, ఇకపై కూడా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా.. పరిష్కరిస్తారని భావిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు.