ఐదుగురిని బలితీసుకున్న సెల్ఫీ సరదా

ABN , First Publish Date - 2020-07-03T05:29:49+05:30 IST

జలపాతం వద్ద సరదాగా సెల్ఫీ దిగుదామని ప్రయత్నించి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన

ఐదుగురిని బలితీసుకున్న సెల్ఫీ సరదా

పాల్గఢ్: ఓ జలపాతం వద్ద సరదాగా సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులు చివరికి అక్కడే ప్రాణాలు కోల్పోయిన వైనమిది. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లా జవహార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కొవిడ్-19 లాక్‌డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ 13 మందితో కూడిన ఓ బృందం జవహార్ టౌన్ సమీపంలోని కాల్మండ్వి జలపాతం వద్దకు వెళ్లినట్టు అధికారులు పేర్కొన్నారు. ‘‘ఈ బృందంలోని ఇద్దరు వ్యక్తులు సెల్ఫీ తీసుకుంటూ కిందనున్న కొలనులో జారిపడ్డారు. వారిని రక్షించేందుకు మరికొందరు నీళ్లలోకి దూకారు. ఈ క్రమంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు..’’ అని స్థానిక పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-03T05:29:49+05:30 IST