స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
ABN , First Publish Date - 2022-08-14T05:04:25+05:30 IST
స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలి
యాచారం, ఆగస్టు 13: స్వయం ఉపాధితో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని జిల్లా డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ అన్నారు. మండలంలోని నజ్దిక్సింగారంలో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, యూనియన్ బ్యాంక్, స్వర్ణభారత్ ట్రస్ట్లు సంయుక్తంగా గ్రామంలో మహిళలకు ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవల్పమెంట్ కార్యక్రమం కింద ఆరు రోజుల పాటు గాజుల తయారీపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ ముగించుకున్న మహిళలకు పీడీ, ఎంపీపీ శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ డీపీఎం బాలరాజు, జేడీఎం హమీద్, డైరెక్టర్ కృష్ణ, ఎంపీడీవో శ్రీనివా్సరెడ్డి, ఎపీఎం సతీష్ ఉన్నారు.