స్వీయ నియంత్రణ పాటించాలి: మంత్రి వెల్లంపల్లి

ABN , First Publish Date - 2020-04-01T19:10:54+05:30 IST

నగరంలోని రాజరాజేశ్వరి పేట కరోనా పాజిటివ్‌ కంటోన్మెంట్‌ జోన్‌ ప్రాంతంలో..

స్వీయ నియంత్రణ పాటించాలి: మంత్రి వెల్లంపల్లి

విజయవాడ: నగరంలోని రాజరాజేశ్వరి పేట కరోనా పాజిటివ్‌ కంటోన్మెంట్‌ జోన్‌ ప్రాంతంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ బుధవారం పర్యటించారు. డ్రోన్‌తో సోడియం హైడ్రో క్లోరైడ్‌ చల్లించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తున్న సిబ్బందిలో మనో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వాధికారులు, మానవతావాదులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి ఇంటిపట్టునే ఉండాలని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చినవారు స్వచ్చంధంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పిలుపు ఇచ్చారు.

Updated Date - 2020-04-01T19:10:54+05:30 IST