స్వీయ నిర్బంధం తప్పనిసరి
ABN , First Publish Date - 2020-03-29T11:39:57+05:30 IST
విదేశాల వచ్చిన వారు 14 రోజులు స్వీయనిర్బంధంలో తప్పనిసరిగా ఉండాలని తహసీల్దార్ ఎస్.నర్సింహ మూర్తి, ఎస్ఐ మహమ్మద్
భామిని, మార్చి 28: విదేశాల వచ్చిన వారు 14 రోజులు స్వీయనిర్బంధంలో తప్పనిసరిగా ఉండాలని తహసీల్దార్ ఎస్.నర్సింహ మూర్తి, ఎస్ఐ మహమ్మద్ అజాద్ అహ్మద్ తెలిపారు. పెద్దదిమిలికి ఇటీవల కువైట్ నుంచి పలువరు రావడంతో వారితో శనివారం మాట్లాడారు.
ఆండ్రాయిడ్ ఫోన్లో కరోనా యాప్ను ఇన్స్టాల్ చేశారు. దీంతో సదరు వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు. ఏమి చేస్తున్నాడో వివరాలను జిల్లాస్థాయి అధికారులకు తెలుస్తుందని ఎస్, తహసీల్దార్ తెలిపారు. కాగా పెద్దదిమిలి, సతివాడ, సింగిడిల్లో ఆటోల ద్వారా కరోనా వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించారు. వారితోపాటు ఆర్ఐ కె.కృష్ణారావు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.