గొర్రెల పంపిణీకి గ్రామాల ఎంపిక

ABN , First Publish Date - 2022-08-20T05:24:38+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెల పథకం కింద రెండవ విడత ప్రాధాన్యత క్రమంలో గొర్రెలను పంపిణీ చేసేం దుకు కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ లాటరీ తీసి గ్రామాలను ఎంపిక చేశారు.

గొర్రెల పంపిణీకి గ్రామాల ఎంపిక
లాటరీ ద్వారా గ్రామాలను ఎంపిక చేస్తున్న కలెక్టర్‌

పెద్దపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెల పథకం కింద రెండవ విడత ప్రాధాన్యత క్రమంలో గొర్రెలను పంపిణీ చేసేం దుకు కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ లాటరీ తీసి గ్రామాలను ఎంపిక చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డ్రా తీశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ రెండవ విడతలో సుమారు 10 వేల మంది లబ్ధిదారు లకు గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలను కొనుగోలు చేసి తీసుక రావాల్సి ఉంటుందన్నారు. లాటరీ ద్వారా గ్రామాలను ఎంపిక చేశామని, వాటి ప్రకారం గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. గొర్రెకాపరుల సొసైటీల నుంచి వస్తున్న సూచనలను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ నారాయణ, ఏడీ డాక్టర్‌ వి రవీందర్‌రెడ్డి, పశు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:24:38+05:30 IST