టేబుల్ టెన్నీస్ క్రీడాకారుల ఎంపిక
ABN , First Publish Date - 2021-10-20T06:11:59+05:30 IST
రాష్ట్రస్థా యి పోటీలకు టేబుల్ టెన్నీస్ క్రీడాకారు ల ఎంపికకు స్థానిక అశోక్నగర్లోని డీ ఎస్ఏ ఇండోర్ స్టేడియంలో మంగళవారం పోటీలను నిర్వహించారు.
అనంతపురం క్లాక్టవర్, అక్టోబరు 19 : రాష్ట్రస్థా యి పోటీలకు టేబుల్ టెన్నీస్ క్రీడాకారు ల ఎంపికకు స్థానిక అశోక్నగర్లోని డీ ఎస్ఏ ఇండోర్ స్టేడియంలో మంగళవారం పోటీలను నిర్వహించారు. జిల్లా టేబుల్ టెన్నీస్ సంఘం అధ్యక్షుడు మురళీధర్రావు, డీఎ్సఏ చీ ఫ్కోచ జగన్నాథ్రెడ్డి క్రీడాకారులను ఎంపిక చేశారు. సీనియర్ విభాగంలో కుళాల్కుమార్, వంశీకృష్ణ, హర్షవర్దన, సజిద్హుస్సేన, బాలసుబ్రహ్మణ్యం, మహిళల్లో హాసిని, శ్రేష్ట, హిమప్రియ, విద్యాధరి, నాగేశ్వరి ఉన్నారు. అండర్ 19 బాలురలో ధార్మిక్, కృష్ణ, అచ్చుతసమితరెడ్డి, జీవనకుమార్, బాలికల్లో శ్రేష్ట, హాసిని, హిమప్రియ, విద్యాధరి ఉన్నా రు. అండర్-15 బాలురలో హృదయ్, చక్రధర్, దీక్షిత, చేతనచక్రవర్తి, బాలికల్లో శ్రీశాన్వి, సుహాన, శాతజ్యోతి, మనస్విణి ఉన్నారు. వీరు ఈ నెల 30, 31, నవంబరు 1, 2వ తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగే రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నీస్ పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో జిల్లా టీటీ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, డీఎ్సఏ కోచ ధనుంజయరెడ్డి, కోచలు రవీంద్రనాథ్, వంశీకృష్ణ పాల్గొన్నారు.
రేపటి నుంచి జూడో క్రీడాకారుల ఎంపిక
అనంతపురం క్లాక్టవర్, అక్టోబరు 19 : జిల్లా స్థాయి జూడో క్రీడాకారుల ఎంపిక పోటీలు గురు, శుక్ర వారాల్లో ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా జూడో సంఘం కార్యదర్శి కేఎన బాబు తెలిపారు. గురువారం బాలికలకు, శుక్రవారం బాలురకు పోటీలు ఉంటాయన్నారు. వివరాలకు నెం. 8328113928ను సంప్రదించాలని కోరారు.