సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తి: ఎమ్మెల్యే గణేశ్‌

ABN , First Publish Date - 2021-01-27T05:10:33+05:30 IST

నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ తెలిపారు.

సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తి: ఎమ్మెల్యే గణేశ్‌
ముఖ్య నేతలతో సమావేశమైన ఎమ్మెల్యే గణేశ్‌

నర్సీపట్నం, జనవరి 26: నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తిచేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ తెలిపారు. మంగళవారం తన స్వగృహంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో ఎమ్మెల్యే  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజవర్గంలోని 101 పంచాయతీలకు సర్పంచ్‌ అభ్యర్థులను గత ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికతో పాటే పూర్తి చేశామని, ఎన్నికల్లో వారే పోటీ చేస్తారన్నారు. ఈనెల 28న నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, 29న మాకవరపాలెంలో పార్టీ నేతలతో సమావేశమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో సుర్ల సత్యనారాయణ, అకంరెడ్డి జమీలు, సుర్ల గిరిబాబు, చిటికెల భాస్కరనాయుడు, శీరంరెడ్డి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


 ‘పంచాయతీ ఎన్నికల్లో వైసీపీదే విజయం’

కోటవురట్ల: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసీపీ  విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ జోస్యం చెప్పారు. కోటవురట్లలో మంగళవారం వీడియంతో మాట్లాడుతూ మరో 30 ఏళ్లు  జగన్మోహన్‌రెడ్డి సీఎంగా కొనసాగుతారన్నారు.  


Updated Date - 2021-01-27T05:10:33+05:30 IST