6న కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు
ABN , First Publish Date - 2021-03-05T04:31:05+05:30 IST
తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 6వ తేదీ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షరాలు మమత, కార్యదర్శి రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు క్రీడలు, మార్చి 4: తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 6వ తేదీ కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షరాలు మమత, కార్యదర్శి రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పురుషులైతే 70 కిలోలు, మహిళలైతే 65 కిలోల లోపు బరువుండాలన్నారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డు వెంట తీసుకురావాలన్నారు. ఎంపికైన వారు ఈ నెల 12వ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరపు పాల్గొంటారన్నారు. వివరాలకు 8639910158 నెంబరును సంప్రదించాలన్నారు.