ప్రధానోపాధ్యాయుల జిల్లా కార్యవర్గం ఎంపిక

ABN , First Publish Date - 2022-07-04T06:05:53+05:30 IST

శ్రీసత్యసాయిజిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు.

ప్రధానోపాధ్యాయుల జిల్లా కార్యవర్గం ఎంపిక
నూతనంగా ఎన్నికైన జిల్లా హెచఎంల కార్యవర్గ సభ్యులు


కొత్తచెరువు, జూలై 3: శ్రీసత్యసాయిజిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్టు రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం కొత్తచెరువులోని జిల్లాపరిషత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ుజిల్లా ప్రధానోపాధ్యాయులు కమిటీని ఎంపికచేశారు. అధ్యక్షుడిగా జీవీ సుబ్బారావు, ప్రధానకార్యదర్శిగా సురేశబాబు, కోశాధికారిగా ఎం.వెంకటేశ, గౌరవ అద్యక్షుడిగా ఫణికుమార్‌, రాష్ట్ర కౌన్సిలర్లుగా గోపాల్‌, నాగార్జున, భాస్కర్‌రెడ్డిలు ఎంపికయ్యారు.  ఎన్నికల పరిశీలకుడిగా ఉమ్మడిజిల్లాల అధ్యక్షుడు జయరామిరెడ్డి వ్యవహరించారు.



Updated Date - 2022-07-04T06:05:53+05:30 IST