28న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-02-25T05:04:09+05:30 IST

జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికను ఈ నెల 28న స్థానిక రాజీవ్‌గాంఽధీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

28న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

బాబామెట్ట, ఫిబ్రవరి 24:  జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికను ఈ నెల 28న స్థానిక రాజీవ్‌గాంఽధీ స్టేడియంలో నిర్వహించనున్నారు.  వచ్చేనెల 15నుంచి కర్నూలులో రాష్ట్రస్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలు జరగనున్నట్లు   కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.ఈశ్వర కౌశిక్‌, సూరిబాబు బుధవారం తెలిపారు. ఈ మేరకు జిల్లా క్రీడాకారులను ఎంపిక చేయనున్నామని చెప్పారు. ఆధార్‌కార్డ్‌, ఒరిజినల్‌ మార్క్‌ లిస్టుతో స్టేడియానికి రావాలని సూచిం చారు. ఇతర వివరాలకు ఈ 9440152269, 8074858972 నెంబర్లను సంప్ర దించాలని కోరారు. 

 

Updated Date - 2021-02-25T05:04:09+05:30 IST