దళితబంధు లబ్దిదారుల ఎంపిక కష్టమే: ఎమ్మెల్యే గండ్ర
ABN , First Publish Date - 2022-02-04T01:23:10+05:30 IST
దళితబంధు పథకానికి లబ్దిదారుల ఎంపిక కష్టమేనని భూపాలపల్లి ఎమ్మెల్యే
హన్మకొండ: దళితబంధు పథకానికి లబ్దిదారుల ఎంపిక కష్టమేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కలెక్టరేట్లో జరిగిన దళిత బంధు పథకంపై సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధుకి సంబంధించి 100 మంది లబ్దిదారులను ఎంపిక చేయడం కష్టమేనన్నారు. తన నియోజకవర్గంలో మండలానికి ఆరువేల మంది దళితులున్నారన్నారు. స్కీమ్ అమలుకు అనుభవం ఉన్న అధికారులు కావాలని ఎమ్మెల్యే గండ్ర పేర్కొన్నారు.