గురుకులాల్లో ఎంపిక జాబితా విడుదల

ABN , First Publish Date - 2020-08-08T10:03:05+05:30 IST

ఏపీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఉత్తర్వుల మేరకు గురుకుల పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల జాబితా ..

గురుకులాల్లో ఎంపిక జాబితా విడుదల

నెల్లూరు (విద్య) ఆగస్టు 7 : ఏపీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి ఉత్తర్వుల మేరకు గురుకుల పాఠశాలలకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేసినట్లు ఇన్‌ఛార్జి డీఈవో ఉష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గండిపాళెం, వెంకటగిరి, తుమ్మలపెంట, చిల్లమానుచేను, నెల్లూరు, ఆత్మకూరు గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతిలో వ్రవేశాలకు లాటరీ పద్ధతి ద్వారా ఇటీవల ఎంపిక చేశామన్నారు. ఈ ఫలితాలను డీఈవో కార్యాలయం, వెబ్‌సైట్‌, గురుకుల పాఠశాలల్లో అందుబాటులో ఉంచామన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి రిఫరెన్స్‌ ఐడీ ఆధారంగా ఫలితాలను తెలుసుకోవచ్చని ఆమె తెలిపారు.

Updated Date - 2020-08-08T10:03:05+05:30 IST