రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

ABN , First Publish Date - 2021-11-30T06:50:09+05:30 IST

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మో త్కూరు క్రీడాకారు లు ఎంపికయ్యా రు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

మోత్కూరు, నవంబరు 29: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మో త్కూరు క్రీడాకారు లు ఎంపికయ్యా రు. ఆలేరు జడ్పీ హైస్కూల్‌లో ఈ నెల 28న నిర్వహించిన సబ్‌ జూనియర్‌ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో మోత్కూరు సేక్రెడ్‌ హార్ట్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రతిభ చాటా రు. ఎం.సాయికుమార్‌, ఎండి.అయూశా, బి.మాధురి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ ఎం.తానయ్య, పీఈటీ ఎం.యాదయ్య తెలిపారు. మంచిర్యాలలో డిసెంబరులో నిర్వహించనున్న  రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఆడతారని పేర్కొన్నారు. ఎంపికైన వారిని జి ల్లా కార్యదర్శి నాగయ్య, కోచ సతీష్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

రాజాపేట: మండలంలోని బొందుగుల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు హెచఎం కోటేశ్వర్‌రావు సోమవారం తెలిపారు. ఆలేరులో జరిగిన జిల్లా స్థాయి బాల బాలికల కబడ్డీ పోటీల్లో ముత్యం రాధ, బచ్చలి అరుణ్‌, గొల్లూరి సుస్మిత ప్రతి భ కనబరిచారు. క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికవడంతో వారిని ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు. 


Updated Date - 2021-11-30T06:50:09+05:30 IST