రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

ABN , First Publish Date - 2021-02-27T04:53:27+05:30 IST

యూత్‌ క్రికెట్‌ క్లబ్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు క్రికెట్‌ కోచ్‌లు అహమ్మద్‌, శ్రీకాంత్‌లు తెలిపారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
క్రికెట్‌ కోచ్‌లను సత్కరించి అభినందనలు తెలియజేస్తున్న నిర్వాహకులు ఎంపికైన క్రీడాకారులు

ప్రొద్దుటూరు టౌన్‌, ఫిబ్రవరి 26: యూత్‌ క్రికెట్‌ క్లబ్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు క్రికెట్‌ కోచ్‌లు అహమ్మద్‌, శ్రీకాంత్‌లు తెలిపారు. ఈ సందర్భంగా వారు శుక్ర వారం విలేకర్లతో మాట్లాడుతూ శివకుమార్‌రెడ్డి విజయ్‌హజారే ట్రోఫీ ఆంధ్రాజట్టుకు ఎంపికకాగా మహిళల రాష్ట్ర సీనియర్‌ జట్టుకు శిరీష ఎంపికయ్యారన్నా రు. కాగా వారి ఎంపికకు  కృషి చేసిన కోచ్‌లను యూత్‌క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షుడు మార్తల సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. శిరీష మార్చి 12 నుంచి జైపూర్‌లో జరిగే మ్యాచ్‌లో ఆంధ్రాజట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని, శివకుమార్‌రెడ్డి ఈనెల 20 నుంచి ఇండోర్‌లో జరుగుతున్న పోటీలలో ఆడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వేణుగోపాల్‌, రసూల్‌గౌస్‌, పీడీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T04:53:27+05:30 IST