జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ABN , First Publish Date - 2021-04-13T05:26:10+05:30 IST
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లాలోని పదర మండ లం మద్దిమడుగుకు చెందిన అంజి ఎంపికైనారు.
నాగర్కర్నూల్ టౌన్, ఏప్రిల్ 12: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు జిల్లాలోని పదర మండ లం మద్దిమడుగుకు చెందిన అంజి ఎంపికైనారు. ఈ నెల 13నుంచి 17వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో జరుగుతున్న జాయతీ స్థాయి కబడ్డీ పోటీలకు వెళ్తున్న అంజిని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ జనార్దన్రెడ్డితో పాటు సభ్యులు సోమవారం సన్మానించారు. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, మీర్పేట్ సీఐ మహేందర్రెడ్డి, గద్వాల కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి అబ్రహం, కురుమూర్తిగౌడ్, హేమంత్, సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.