మోదీ సర్కార్ వల్లేసివిల్స్కి 87 మంది అగ్రవర్ణ పేదలు ఎంపిక
ABN , First Publish Date - 2020-08-13T07:41:08+05:30 IST
నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్లే సివిల్ సర్వీసెస్ పరీక్షలో
- ఎకానమికల్ వీకర్స్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం
బర్కత్పుర, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్లే సివిల్ సర్వీసెస్ పరీక్షలో అగ్రవర్ణ పేదలు 87 మంది ర్యాంకులు సాధించారని ఎకానమికల్ వీకర్స్ సెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తాటిశెట్టి పశుపతి చెప్పారు. బషీర్బాగ్లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ కోటా కారణంగానే ఈడబ్ల్యూఎస్ విద్యార్ధులు సివిల్స్లో ఎక్కువ ర్యాంకులు సాధించారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని అగ్రవర్ణ పేదలంతా మోదీకి రుణపడి ఉంటారని ఆయన చెప్పారు.