జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక
ABN , First Publish Date - 2021-08-02T05:51:07+05:30 IST
గోదావరిఖని పవర్హౌస్కాలనీలో నివాసముండే సింగరేణి కార్మికుడు దూత రాంమోహన్ కుమార్తె శృతి జూనియర్ సివిల్జడ్జిగా ఎంపికయ్యారు.
గోదావరిఖని, ఆగస్టు 1: గోదావరిఖని పవర్హౌస్కాలనీలో నివాసముండే సింగరేణి కార్మికుడు దూత రాంమోహన్ కుమార్తె శృతి జూనియర్ సివిల్జడ్జిగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి రాంమోహన్ ఇందారం ఓసీపీలో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఎల్ఎల్బీ పూర్తిచేసిన శృతి పట్టుదలతో, జడ్జి కావాలనే లక్ష్యంతో తొలిప్రయత్నంలోనే విజయం సాధించారు. 2020జారీ అయిన నోటిఫికేషన్లో న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. సింగరేణి కార్మికుని బిడ్డ న్యాయమూ ర్తిగా ఎంపికకావడంపై హెచ్ఎంఎస్ రాష్ట్ర రియాజ్అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం హెచ్ఎంఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు తోట వేణు ఆధ్వర్యంలో ఆమెకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు జక్కుల నారాయణ, బోనగిరి సమ్మయ్య, దావు రమేష్, అంబటి నరేష్, చందర్రావు పాల్గొన్నారు.