ఇళ్ల పట్టాలకు అర్హులను ఎంపిక చేయండి
ABN , First Publish Date - 2020-07-07T11:14:05+05:30 IST
సచివాలయాల్లో ఎంపిక చేసిన ఇళ్ల పట్టాల జాబితాలో ఉన్న అక్రమాలను సరిచేసి అర్హులను మళ్లీ ఎం పిక చేయాలని సోమవారం టీడీపీ మండల
వజ్రపుకొత్తూరు, జూలై 6: సచివాలయాల్లో ఎంపిక చేసిన ఇళ్ల పట్టాల జాబితాలో ఉన్న అక్రమాలను సరిచేసి అర్హులను మళ్లీ ఎం పిక చేయాలని సోమవారం టీడీపీ మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సం దర్భంగా నాయకులు మాట్లాడుతూ బెండిగేటు వద్ద నిర్మించిన హుద్హుద్ ఇళ్లను గతంలో ఎంపిక చేసిన వారికే అందజేయాలని కోరారు. టీడీపీ మాజీ మండల అధ్యక్షలు బి.శశిభూ షన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ నారాయణమూర్తికి వినతి పత్రం అంద జేశారు. కార్యక్రమంలో సూరాడ మోహనరావు, మరడ దుర్యోధనరెడ్డి, అర్సవల్లి ఉమామహేశ్వరరావు, పోతనపల్లి షన్ముఖరావు పాల్గొన్నారు.