రెండు ఇసుక ట్రాక్టర్‌ల పట్టివేత

ABN , First Publish Date - 2020-08-04T11:15:31+05:30 IST

మండలంలోని మారెళ్ల సమీపంలో ఈదర వాగు నుంచి సోమవారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం ..

రెండు ఇసుక ట్రాక్టర్‌ల పట్టివేత

ముండ్లమూరు, ఆగస్టు 3 : మండలంలోని మారెళ్ల సమీపంలో ఈదర వాగు నుంచి సోమవారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ టీబీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. ఇసుకను తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్‌కు తరలించినట్టు చెప్పారు. పట్టుబడిన ట్రాక్టర్‌లో ఒకటి మారెళ్లది కాగా, మరొకటి గంగన్నపాలేనికి చెందిన వారిదని చెప్పారు.

Updated Date - 2020-08-04T11:15:31+05:30 IST