గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-11T08:41:37+05:30 IST

గంజాయి స్వాధీనం

గంజాయి స్వాధీనం

పాలకొల్లు టౌన్‌, జూలై 10: విశాఖ నుంచి తరలిస్తున్న గంజాయిని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ కె.నాగేశ్వరరావు శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.  గురువారం రాత్రి 11 గంటలకు పట్టణ సీఐ సీహెచ్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో గస్తీ తిరుగుతున్న ఎస్‌ఐలు జేవీఎన్‌.ప్రసాద్‌, ఎఫ్‌ రెహ్మాన్‌ గం జాయి ముఠాను అదుపులోకి తీసుకున్నా రు. వారి వద్ద 435 కిలోల గంజాయి, కారు, 2మోటార్‌ బైక్‌లు, 2సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2020-07-11T08:41:37+05:30 IST