అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-08-07T05:51:27+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్‌ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 16టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పట్టివేత


ఆదిలాబాద్‌అర్బన్‌, ఆగస్టు6: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్‌ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 16టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టూటౌన్‌ క్రైమ్‌ పోలీసులు సమాచా రం మేరకు పెట్రోలింగ్‌ నిర్వహించగా పట్టణానికి చెందిన సంతోష్‌కుమార్‌ అగర్వాల్‌ తండ్రి శంకర్‌లాల్‌, దేవేందర్‌ ట్రేడర్స్‌ పేరుపైన ఉన్న గోదాములలో ప్రతి రోజు 10 క్వింటాళ్ల అక్రమ బియ్యాన్ని కొని గోదాంలో ఉంచి ఒకేసారి తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు సివిల్‌ సప్లయి అధికారులతో కలిసి పట్టుకున్నారు. గతంలో సైతం ఈయన పలుమార్లు అక్రమంగా బియ్యం తరలించిన కేసులు ఉన్నాయని, మళ్లీమళ్లీ అదే పనిని కొనసాగిస్తున్నారని తెలిపారు. మొత్తం 270 బ్యాగులు సివిల్‌ సప్లయి గోదాములకు తరలించారు. అక్రమంగా నిల్వ ఉంచిన బియాన్ని పట్టుకున్న క్రైమ్‌ బ్రాంచ్‌ పార్టీ ఎస్సై విష్ణుప్రకాష్‌, కానిస్టేబుళ్లు ఆర్‌ఎస్‌ రమేష్‌, నరేష్‌లను అధికారులు అభినందించారు.

Updated Date - 2022-08-07T05:51:27+05:30 IST