అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-04-16T05:27:52+05:30 IST
గౌరారం సమీపంలోని కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యన్ని ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు.
వర్గల్, ఏప్రిల్ 15: గౌరారం సమీపంలోని కోళ్ల ఫారంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యన్ని ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. గజ్వేల్ డీటీసీఎస్ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. గౌరారం సమీపంలోని కోళ్ల ఫారంలో చంద్రారెడ్డి అనే వ్యక్తి రేషన్ బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నట్లు సమచారం తెలుసుకున్నారు. గురువారం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్, ఓఎ్సడీ ద్రోణాచార్యుల నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. కోళ్ల ఫారంలో నిల్వ ఉంచిన 271 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని బియ్యాన్ని దౌల్తాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించినట్లు తెలిపారు.