రూ.73 లక్షల విలువైన బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2021-03-09T16:11:27+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న రూ.73 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న అధి కారులు తంజావూరుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాలిలా వున్నాయి...

రూ.73 లక్షల విలువైన బంగారం పట్టివేత

చెన్నై/ఐసిఎఫ్(ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలిస్తున్న రూ.73 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న అధి కారులు తంజావూరుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వివరాలిలా వున్నాయి... ఆదివారం తెల్లవారుజామున సింగపూర్‌ నుంచి ఎయిర్‌ ఇండియా  విమానం తిరుచ్చి విమానాశ్రయానికి వచ్చింది. ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో ఇద్దరిని అను మానించి ప్రత్యేక గదిలో తీసుకెళ్లి తనిఖీ చేశారు. తంజా వూరు జిల్లా పునవాసల్‌కు చెందిన మణిమారణ్‌, ఒరత్త నాడుకు చెందిన సెంథిల్‌ లోదస్తుల్లో దాచిన తలా రూ.36.74 లక్షల విలువైన 798 గ్రాముల బంగారం గుర్తించి, స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2021-03-09T16:11:27+05:30 IST