రూ1.3కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-06-20T09:20:07+05:30 IST

తెలంగాణా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కోటి మూడు లక్షల రూపాయల విలువైన గంజాయిని అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. అశ్వారావుపేట పోలీసులు శనివారం ఏపీ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ

రూ1.3కోట్ల విలువైన గంజాయి పట్టివేత

అశ్వారావుపేట, జూన్‌ 19: తెలంగాణా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కోటి మూడు లక్షల రూపాయల విలువైన గంజాయిని అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. అశ్వారావుపేట పోలీసులు శనివారం ఏపీ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన వాహనంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్‌  రాహుల్‌, మహ్మత్‌ సత్తార్‌, విజయనగరం జిల్లా కొలుగుపేటకు చెందిన వ్యాన్‌ డ్రైవర్‌ కంప రామిరెడ్డి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వాహనాన్ని తనిఖీ చేయగా 130 ప్యాకెట్లలో 686.50కిలోల గంజారు పట్టుబడగా.. దాని విలువ రూ.1.02,97,500 ఉంటుందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-06-20T09:20:07+05:30 IST