గచ్చిబౌలిలో గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2022-02-01T02:40:38+05:30 IST
నగరంలోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గచ్చిబౌలి గౌలిదొడ్డిలో 22 కిలోల గంజాయిని గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ఆదిత్య కుమార్ ఠాకూర్(28), సందీప్ సర్ధార్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఒడిశాలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి హైద్రాబాద్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 22 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని కొన్నా, అమ్మినా, తాగినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.