544 కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-04-22T05:41:17+05:30 IST
మండలంలోని మర్రిబంద సమీపంలో పాడుబడిన ఇంటి వద్ద బుధవారం భారీగా గంజాయి పట్టుబడినట్టు ఎలమంచిలి సీఐ వి.నారాయణరావు తెలిపారు.
మర్రిబంద సమీపంలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎలమంచిలి, ఏప్రిల్ 21 : మండలంలోని మర్రిబంద సమీపంలో పాడుబడిన ఇంటి వద్ద బుధవారం భారీగా గంజాయి పట్టుబడినట్టు ఎలమంచిలి సీఐ వి.నారాయణరావు తెలిపారు. రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్, హెచ్సీ నిరంజన్ బృందం దాడులు నిర్వహించగా, 544 కిలోల గంజాయిని సదరు ఇంటిలో గుర్తించినట్టు చెప్పారు. ఈ ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకుని వ్యాన్, బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు.