544 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-04-22T05:41:17+05:30 IST

మండలంలోని మర్రిబంద సమీపంలో పాడుబడిన ఇంటి వద్ద బుధవారం భారీగా గంజాయి పట్టుబడినట్టు ఎలమంచిలి సీఐ వి.నారాయణరావు తెలిపారు.

544 కిలోల గంజాయి పట్టివేత
పట్టుబడిన గంజాయి, నిందితులను చూపుతున్న ఎలమంచిలి సీఐ



 మర్రిబంద సమీపంలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

 

ఎలమంచిలి, ఏప్రిల్‌ 21 : మండలంలోని మర్రిబంద సమీపంలో పాడుబడిన ఇంటి వద్ద బుధవారం భారీగా గంజాయి పట్టుబడినట్టు ఎలమంచిలి సీఐ వి.నారాయణరావు తెలిపారు. రూరల్‌ ఎస్‌ఐ చంద్రశేఖర్‌, హెచ్‌సీ నిరంజన్‌ బృందం దాడులు నిర్వహించగా, 544 కిలోల గంజాయిని సదరు ఇంటిలో గుర్తించినట్టు చెప్పారు. ఈ ఘటనలో నలుగుర్ని అదుపులోకి తీసుకుని వ్యాన్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

Updated Date - 2021-04-22T05:41:17+05:30 IST