పోలీసుల తనిఖీల్లో 48 ఆటోల సీజ్‌

ABN , First Publish Date - 2022-01-21T07:06:40+05:30 IST

నిర్మల్‌ పట్టణంలో గురువారం పోలీస్‌ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 48 ఆటోలు సీజ్‌చేశారు.

పోలీసుల తనిఖీల్లో 48 ఆటోల సీజ్‌
పత్రాలు పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాస్‌

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 20 : నిర్మల్‌ పట్టణంలో గురువారం పోలీస్‌ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 48 ఆటోలు సీజ్‌చేశారు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ర్టేషన్లు, ఇన్సూరెన్స్‌, తదితర పత్రా లు సక్రమంగా లేని కారణంగా ఆటోలు సీజ్‌ చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలి పారు. తనిఖీల్లో పట్టుబడ్డ ఆటోలను తదుపరి చర్యనిమిత్తం రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్‌ అధికారికి పంపినట్లు వివరించారు. 

Updated Date - 2022-01-21T07:06:40+05:30 IST