సంగారెడ్డి జిల్లాలో 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-09-20T21:22:49+05:30 IST

జహీరాబాద్ మండలం బూచినెల్లిలోని హెచ్.పీ. పెట్రోల్ బంక్ దగ్గర మూడు వందల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు...

సంగారెడ్డి జిల్లాలో 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం బూచినెల్లిలోని హెచ్.పీ. పెట్రోల్ బంక్ దగ్గర మూడు వందల క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీ మరో రెండు చిన్న వాహనాలలో బియ్యాన్ని తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.


యాదాద్రి: యాదాద్రి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం కొరటికల్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల రేషన్‌ బియ్యంను పోలీసులు పట్టకున్నారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్‌ చేసి ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-09-20T21:22:49+05:30 IST