టీమిండియా విజయంపై సెహ్వాగ్ టీజింగ్ ట్వీట్

ABN , First Publish Date - 2021-01-19T19:52:16+05:30 IST

టీమిండియా విజయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అద్భుతమైన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో భారత యువ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తడంతో..

టీమిండియా విజయంపై సెహ్వాగ్ టీజింగ్ ట్వీట్

బ్రిస్బేన్: టీమిండియా విజయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అద్భుతమైన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో భారత యువ ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటే ఆసీస్ ఆటగాళ్లకు కూడా చురకలంటించారు. ‘ఆనందంతో పిచ్చెక్కిపోతోంది. ఇది సరికొత్త ఇండియా. ప్రత్యర్థి ఇంట్లో దూరి మరీ కొడుతుంది. జీవితానికి సరిపడా ఆనందాన్ని యువ ఆటగాళ్లు అందించారు. అడిలైడ్‌లో ఘోర ఓటమి నుంచి అద్భుతంగా కోలుకుని ఆడిన తీరు అద్భుతం. ఇప్పటివరకు ప్రపంచ కప్‌ విజయాలను చూశాం కానీ.. ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనది. అది మాత్రమే కాదు.. పంత్ నిజంగానే ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు’ అంటూ సెహ్వాగ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.


మరో ట్వీట్లో ఆసీస్‌కు చురకలంటించాడు. భారత జట్టులో ఎంతోమంది ఆటగాళ్లు గాయాల పాలయ్యారని, అయితే అంతకంటే ఎక్కువగా ఆస్ట్రేలియా జట్టు అహంకారం, గర్వం దెబ్బతిన్నదని రాసుకొచ్చారు. ‘ఈ టెస్ట్ సిరీస్ మొత్తం ఓ సినిమాలా గడిచింది. అందులో భారత ఆటగాళ్లంగా హీరోలే. అందులో మరింకొంతమంది సూపర్ హీరోలు’ అంటూ తన ట్వీట్లో పేర్నొన్నారు. అంతేకాకుండా సోమవారం వైరల్ అయిన పంత్ ‘స్పైడర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్’ పాటను కూడా గుర్తు చేసుకున్నారు. ‘స్పైడర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్... నీవు నిజంగా మనసులు గెలుచుకున్నావ్’ అంటూ రాసుకొచ్చారు.





Updated Date - 2021-01-19T19:52:16+05:30 IST