చెన్నై జట్టు, రవీంద్ర జడేజాపై సెహ్వాగ్ తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2020-10-24T01:02:29+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో అత్యంత చెత్తగా ఆడుతున్న ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై జట్టు, రవీంద్ర జడేజాపై సెహ్వాగ్ తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో అత్యంత చెత్తగా ఆడుతున్న ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా, ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. చెన్నై పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ తాజాగా మాట్లాడుతూ చెన్నై జట్టును సీనియర్ సిటిజెన్స్ క్లబ్‌గా అభివర్ణించాడు.


ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో ముంబైని ఓడించిన తర్వాత చెన్నై విన్నింగ్ జట్టు కంటే తక్కువ, సీనియర్ సిటిజెన్స్ క్లబ్‌ కంటే ఎక్కువలా కనిపిస్తోందని ఎద్దేవా చేశాడు. అలాగే, రవీంద్ర జడేజా బౌలింగ్‌పైనా సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. ‘హంగామా’ సినిమాలో రాజ్‌పాల్ యాదవ్‌లా జడేజా కనిపిస్తున్నాడని సెటైర్ వేశాడు. 

Updated Date - 2020-10-24T01:02:29+05:30 IST