వెలంపల్లికి రాజధాని సెగ

ABN , First Publish Date - 2021-07-25T07:44:51+05:30 IST

రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివా్‌సకు రాజధాని సెగ తగిలింది. శనివారం గురుపౌర్ణమి సందర్భంగా మంత్రి రాజధానిలోని తాళ్లాయపాలెం పరిధిలో గల శైవక్షేత్రంలో పూజలు నిర్వహించటానికి రాగా, మంత్రిని కలిసేందుకు రాజధాని మహిళలు, రైతులు యత్నించారు

వెలంపల్లికి రాజధాని సెగ

తుళ్లూరు, జూలై 24: రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివా్‌సకు రాజధాని సెగ తగిలింది. శనివారం గురుపౌర్ణమి సందర్భంగా మంత్రి రాజధానిలోని తాళ్లాయపాలెం పరిధిలో గల శైవక్షేత్రంలో పూజలు నిర్వహించటానికి రాగా, మంత్రిని కలిసేందుకు రాజధాని మహిళలు, రైతులు యత్నించారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. దీంతో.. స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వస్తున్న మంత్రికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని పక్కకు లాగేసి, మంత్రిని వాహనంలోకి ఎక్కించి పంపించేశారు. ఆలయ నిర్మాణంపై మంత్రి సమాధానం కూడా చెప్పలేక తప్పించుకుపోవడం సిగ్గుచేటని రాజధాని రైతులు, దళిత జేఏసీ సభ్యులు విమర్శించారు. ఆలయ నిర్మాణానికి తొలుత ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాలు యథాతథంగా ఉంచి ఆలయ అభివృద్ధిని త్వరరితగతిన పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు.. 

Updated Date - 2021-07-25T07:44:51+05:30 IST